South West Monsoon in andhra pradesh & TS(Telugu flash news): తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ….తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది.
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో విస్తరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీలోనూ అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు మండుటెండలకు అల్లాడిన ప్రజలు వర్షాలతో ఉపసమనం పొందుతున్నారు.