EPAPER

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : స్థల వివాదం.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాకిచ్చిన కూతురు..

MLA Muthireddy : బీఆర్ఎస్ సీనియర్ నేత, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆయన కూతురు తుల్జాభవాని షాకిచ్చారు. చేర్యాల మున్సిపాలిటీకి చెందిన చెరువు భూమిని కబ్జా చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. తన కూతురు తుల్జాభవాని పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అక్రమ మార్గంలో తనకిచ్చిన భూమిని తిరిగి మున్సిపాలిటికి అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యే కూతురు తుల్జాభవాని ప్రకటించారు.


ఆదివారం చేర్యాల చెరువు వద్దకు ఆమె వెళ్లారు. తన పేరిట ఉన్న 21 గుంటల స్థలంలో బోర్డును ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేసిన పనికి ఆమె చేర్యాల ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

గతంలో ఇదే భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ స్థానిక ప్రజలు, విపక్ష నాయకులు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో కబ్జా విషయాన్ని అధికారులు లైట్ తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూతురే స్వయంగా వచ్చి ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×