EPAPER

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..


JanaSena (political news in ap) : జనసేన శ్రేణులకు ఏపీ ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ గుర్తును గాజు గ్లాసుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. ఇది జనసేన ఊరటగా చెప్పొచ్చు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే ఈ ఉత్తర్వలు అమలు అవుతాయి.

ఈ ఏడాది మేలో గుర్తింపు పొందిన పార్టీల వివరాల్ని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయిందని ఈసీ తెలపింది. ఎన్నికల కమీషన్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చేసింది.


2019 ఎన్నికలకు ముందు ఈసీ.. జనసేనకు గాజు గ్లాసును కేటాయించిన తరువాత.. పార్టీ శ్రేణులు గుర్తును ప్రజల్లో విజయవంతంగా తీసుకొని వెళ్లారు. కానీ, తరువాత పార్టీ గుర్తు కోల్పోవడంతో.. జనసేనకు గట్టి షాక్ తలిగినట్టు అయింది. దీంతో.. ప్రత్యర్థి వైసీపీ నేతలు జనసేనపై సెటైర్ల కూడా వేశారు. ఇటీవల పేర్ని నాని కూడా మీ పార్టీ గుర్తు పోయింది.. వెతుక్కొండి అంటూ సెటైర్లు వేశారు. అయితే.. ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం జనసేనకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×