Kadapa news today(Local news Andhra Pradesh) : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. కడపలో పట్టపగలే కక్షలు కత్తులు దూశాయి. ఇద్దరు దుండగులు బుర్ఖా ధరించి కత్తులతో తెగబడ్డారు. వైసీపీ కార్యకర్త శ్రీనివాసులరెడ్డిని దారుణంగా పొడిచి చంపేశారు. భూతగాదాలే శ్రీనివాసులరెడ్డి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యచేసిన నింతుల కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసులు రెడ్డి కడపలో ఉంటారు. ఆయనకు కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి జిమ్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు మాటు వేశారు. బుర్ఖా ధరించి వచ్చి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున్ ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.