CM KCR today news(TS news updates): ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ గృహ సముదాయానికి కేసీఆర్ నగర్ 2బీకే డిగ్నిటీ హౌసింగ్ కాలనీగా పేరు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ సమయంలో ఆరుగురు లబ్ధిదారులకు ఇంటి పత్రాలను కేసీఆర్ అందించారు. ఆ తర్వాత గృహాలను కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 117 బ్లాకులుగా విభజించారు. భవనాలను జీ+9, జీ+10, జీ+11 అంతస్తులుగా నిర్మించారు. 37 శాతం భూమిలో ఇళ్లు కట్టారు. మిగిలిన 63 శాతం స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.
సంగారెడ్డి జిల్లాలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 2వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఫ్యాక్టరీని కేసీఆర్ పరిశీలించారు.