Agriculture Causing Climate Change :భూమిపై వాతావరణ మార్పులు అనేవి తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా హెచ్చిరిస్తూనే ఉన్నారు. దీని వల్ల మానవాళికి తీవ్ర నష్టం చేకూరుతుందని తెలిసిన తర్వాత కనీసం వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతే కాకుండా పలువురు మనుషులు కూడా వాతావరణ మార్పుల్లో మార్పు తీసుకురావడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాజాగా వాతావరణ మార్పుల విషయంలో శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు.
నీరు, కరెంటు, ఆహారం.. ఈ చైన్ కలిసికట్టుగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఈ మూడింటి విషయంలో మార్పులు చేస్తే.. వాతావరణ మార్పులకు కూడా ఇవి కారణమవుతాయని వారు తెలిపారు. ఉదాహరణకు అగ్రికల్చర్ ఫుడ్ సిస్టమ్స్ అనేవి ప్రపంచంలోని మూడో వంతు కరెంటును ఖర్చు చేస్తున్నాయి. అంతే కాకుండా సగానికి పైగా నీటిని కూడా వినియోగించుకుంటున్నాయి. చాలావరకు వ్యవసాయం అనేది ఇప్పటికీ రైతుల చేతుల్లోనే ఉండగా.. వాతావరణ మార్పులకు రైతులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.
రైతుల చేతుల్లో కాకుండా కొన్ని వ్యవసాయ భూములు.. పరిశ్రమల చేతుల్లో కూడా ఉన్నాయి. అలా వ్యవసాయంతో వ్యాపారం చేస్తున్న పరిశ్రమలు ముందు, వెనుక ఆలోచించకుండా కరెంటును, నీటిని ఖర్చు చేస్తూ వాతావరణం విషయంలో తీవ్రమైన మార్పులకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే టెక్నాలజీ కూడా ముందడుగు వేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాతావరణ మార్పులకు ఒక సిస్టమేటిక్ సొల్యూషన్ అనేది రావాలని వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఎనర్జీ స్మార్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభమయ్యింది. దీని ప్రకారం వ్యవసాయ రంగంలో నేచురల్ వనరుల వినియోగాన్ని తగ్గిస్తూ.. ప్రొడక్షన్ను, పంటను మెరుగుపరుచుకోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వ్యవసాయంలో టెక్నాలజీని మెరుగ్గా ఉపయోగించగలిగితే వాతావరణ మార్పులు అనేవి అదుపులోకి వస్తాయని వారు భావిస్తున్నారు. అందుకే వ్యవసాయంతో వ్యాపారం చేస్తున్న పరిశ్రమలు అన్ని ఇలాంటి టెక్నాలజీలను అలవాటు చేసుకోవాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు.