Pawan kalyan speech today live(Andhra news updates) : వారాహి విజయ యాత్రలో జనసేనాని ఓ ఆసక్తికర కథ చెప్పారు. ఆ కథలో ఎంతో లాజిక్ ఉంది. ఓ హాస్టల్లో ఉప్మా కథను.. రాజకీయాలకు అన్వయించి చెప్పడం ప్రజలను ఆకట్టుకుంది.. ఆలోచింపచేస్తోంది.
అనగనగా ఓ హాస్టల్. సుమారు 100 మంది స్టూడెంట్స్. అందులో కేవలం 18శాతం మందికి ఉప్మా అంటే నచ్చుతుంది. మిగతా 82శాతం స్టూడెంట్స్కి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే, పదే పదే ఉప్మానే పెడుతుండటంతో.. వారంతా వార్డెన్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు.
అయితే, ఎవరికి ఏ టిఫిన్ కావాలో చెప్పండంటూ ఓటింగ్ నిర్వహించాడు ఆ హాస్టల్ వార్డెన్. ఓ ఓటింగ్లో కొందరు పూరి, మరికొందరు దోశ, ఇంకొందరు ఇడ్లీ.. వడ.. ఊతప్పం.. కిచిడీ.. ఇలా తమకు ఇష్టమైన టిఫిన్లను చీటీ మీద రాశారు. ఉప్మా లవర్స్ మాత్రం.. మొత్తానికి మొత్తంగా ఉప్మా అని రాశారు. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా.
ఉప్మాకు ఓటేసిన వాళ్లు 18శాతం ఉంటే.. మిగతా టిఫిన్ల కోసం విద్యార్థులంతా చీలిపోయారు. అలా ఎవరికివారే వేరే వేరు టిఫిన్ల పేర్లు రాయడంతో.. ఉప్మా వ్యతిరేకులు అధిక సంఖ్యలో ఉన్నా.. ఏ టిఫిన్కూ 18శాతం మెజార్టీ రాలేదు. చివరాఖరికి 18శాతం ఓటింగ్లో ఉప్మానే గెలిచింది. హాస్టల్లో మళ్లీ ఉప్మానే పెడుతున్నారంటూ.. ఆసక్తికర కథ చెప్పారు పవన్ కల్యాణ్.
సేమ్ టు సేమ్ ఏపీ రాజకీయాల్లోనూ అలానే జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఆ 75శాతం మంది ఉమ్మడిగా ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో అనైక్యతను జయించాలని.. లేదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వచ్చి తీరుతుందని వివరించి చెప్పారు. వైసీపీ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి ఓట్లు వేయకుండా.. అంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఐక్యం కావాలని.. ముమ్మిడివరం వారాహి యాత్రలో స్టోరీ వినిపించారు జనసేనాని పవన్ కల్యాణ్.