EPAPER

Pawan Kalyan: పవన్ చెప్పిన ‘ఉప్మా’ కథ.. వింటే అవాక్కవ్వాల్సిందే..

Pawan Kalyan: పవన్ చెప్పిన ‘ఉప్మా’ కథ.. వింటే అవాక్కవ్వాల్సిందే..
pawan kalyan speech

Pawan kalyan speech today live(Andhra news updates) : వారాహి విజయ యాత్రలో జనసేనాని ఓ ఆసక్తికర కథ చెప్పారు. ఆ కథలో ఎంతో లాజిక్ ఉంది. ఓ హాస్టల్‌లో ఉప్మా కథను.. రాజకీయాలకు అన్వయించి చెప్పడం ప్రజలను ఆకట్టుకుంది.. ఆలోచింపచేస్తోంది.


అనగనగా ఓ హాస్టల్. సుమారు 100 మంది స్టూడెంట్స్. అందులో కేవలం 18శాతం మందికి ఉప్మా అంటే నచ్చుతుంది. మిగతా 82శాతం స్టూడెంట్స్‌కి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే, పదే పదే ఉప్మానే పెడుతుండటంతో.. వారంతా వార్డెన్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు.

అయితే, ఎవరికి ఏ టిఫిన్ కావాలో చెప్పండంటూ ఓటింగ్ నిర్వహించాడు ఆ హాస్టల్ వార్డెన్. ఓ ఓటింగ్‌లో కొందరు పూరి, మరికొందరు దోశ, ఇంకొందరు ఇడ్లీ.. వడ.. ఊతప్పం.. కిచిడీ.. ఇలా తమకు ఇష్టమైన టిఫిన్లను చీటీ మీద రాశారు. ఉప్మా లవర్స్ మాత్రం.. మొత్తానికి మొత్తంగా ఉప్మా అని రాశారు. ఇక్కడే ఉంది ట్విస్ట్ అంతా.


ఉప్మాకు ఓటేసిన వాళ్లు 18శాతం ఉంటే.. మిగతా టిఫిన్ల కోసం విద్యార్థులంతా చీలిపోయారు. అలా ఎవరికివారే వేరే వేరు టిఫిన్ల పేర్లు రాయడంతో.. ఉప్మా వ్యతిరేకులు అధిక సంఖ్యలో ఉన్నా.. ఏ టిఫిన్‌కూ 18శాతం మెజార్టీ రాలేదు. చివరాఖరికి 18శాతం ఓటింగ్‌లో ఉప్మానే గెలిచింది. హాస్టల్‌లో మళ్లీ ఉప్మానే పెడుతున్నారంటూ.. ఆసక్తికర కథ చెప్పారు పవన్ కల్యాణ్.

సేమ్ టు సేమ్ ఏపీ రాజకీయాల్లోనూ అలానే జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ఆ 75శాతం మంది ఉమ్మడిగా ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో అనైక్యతను జయించాలని.. లేదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వచ్చి తీరుతుందని వివరించి చెప్పారు. వైసీపీ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి ఓట్లు వేయకుండా.. అంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఐక్యం కావాలని.. ముమ్మిడివరం వారాహి యాత్రలో స్టోరీ వినిపించారు జనసేనాని పవన్ కల్యాణ్.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×