Nandan Nilekani: ఐఐటీకి 300 కోట్ల విరాళం.. నందన్ నిలేకని ఔదార్యం. తాను చదువుకున్న బాంబే–ఐఐటీకి భారీ విరాళం అందించారు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని. ఇన్స్టిట్యూట్తో తాను 50 ఏళ్ల అనుబంధం పూర్తి చేసుకున్న సందర్భంగా 315 కోట్లు విరాళంగా ఇచ్చారు.
నందన్ నిలేకని 1973లో బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీలో చేరారు. బాంబే ఐఐటీ తన జీవితానికి మూలస్తంభం లాంటిదన్నారు నిలేకని. అందుకే సంస్థతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని తన వంతు సహకారం అందిస్తున్నానని చెప్పారు. సంస్థకు భవిష్యత్తులోనూ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థికం సహాయం కాదని తన జీవితం ఎంతో ఇచ్చిన సంస్థ పట్ల గౌరవమంటూ కామెంట్ చేశారు నిలేకని.