Rashmika Mandanna : మామూలుగా హీరోలు, హీరోయిన్లు, కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. తాము ఏయే సినిమాలు చేస్తున్నాం, ఎప్పుడు షూటింగ్స్ అటెండ్ అవ్వాలి అనే విషయాలను గుర్తుపెట్టుకునే రిస్క్ తీసుకోరు. అందుకే మ్యానేజర్లను, అసిస్టెంట్లను హైర్ చేసుకుంటారు. హీరో, హీరోయిన్ల డేట్స్ కావాలన్నా, వారి షూటింగ్ విషయంలో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలన్నా ఈ మ్యానేజర్స్దే బాధ్యత. కానీ అలాంటి మ్యానేజర్ చేతిలోనే మోసపోయింది రష్మిక మందనా. తనపై కేసు కూడా ఫైల్ చేసింది.
కొంతమంది హీరోయిన్లు.. ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకోవాలంటే పెద్దగా సమయం పట్టదు. అలాంటి హీరోయిన్లలో రష్మిక మందనా కూడా ఒకరు. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే యూత్ఫుల్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన రష్మిక.. తెలుగులో కూడా ‘ఛలో’ అనే యూత్ఫుల్ సినిమాతోనే హీరోయిన్గా డెబ్యూ ఇచ్చింది. ఆ మూవీ హిట్ అవ్వడంతో రష్మికకు వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ఆపై తన పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ.. పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువకాలం పట్టలేదు.
హీరో, హీరోయిన్లు తమ మ్యానేజర్స్పై, అసిస్టెంట్స్పై పూర్తిగా ఆధారపడతారు. వారు చెప్పిందే నమ్ముతారు. అదే నమ్మకం రష్మికకు నష్టం తెచ్చిపెట్టింది. రష్మిక హీరోయిన్గా మారినప్పటి నుండి తన సినీ ప్రయాణంలో తోడుగా ఉన్న మ్యానేజర్.. రూ.80 లక్షలు మోసం చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి రష్మిక అసలు బయటపెట్టలేదు. తను ఈ విషయంపై ఎక్కువగా సీన్ క్రియేట్ చేయకుండా అతడిని ఉద్యోగం నుండి తొలగించి సైలెంట్ అయిపోయిందని సమాచారం.
రష్మిక.. తనను ఛీట్ చేసిన మ్యానేజర్పై కేసు కూడా పెట్టిందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తున్నా.. ఈ విషయంపై తను స్పందించడానికి మాత్రం ముందుకు రాలేదు. ప్రస్తుతం రష్మిక.. తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటిస్తూనే బాలీవుడ్పై కూడా ఓ కన్నేసింది. అక్కడ రణబీర్ కపూర్తో కలిసి ‘యానిమల్’ అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు తప్పా ఇంకేం సినిమాలను ఇంకా రష్మిక యాక్సెప్ట్ చేసినట్టుగా అధికారిక ప్రకటన రాలేదు.