Haragopal : ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టామని ప్రభుత్వం భావించిందన్నారు. అందుకే రాజదోహ్రం కేసు ఎత్తి వేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. తనపైనే కాదు అందరిపైనా ఆ కేసును ఎత్తివేయాలని కోరారు. అసలు ఉపా చట్టాన్నే రద్దు చేయాలని హరగోపాల్ డిమాండ్ చేశారు.
హరగోపాల్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తాజాగా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయనపై పెట్టిన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారిని నిరోధించేందుకు ఉపా యాక్ట్ తీసుకొచ్చారు.
2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద హరగోపాల్తోపాటు 152 మందిపై కేసు నమోదు చేశారు. ఆయనపై ఆర్మ్స్ యాక్ట్ తోపాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ దేశద్రోహం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ సమాజం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హరగోపాల్ పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.