Telangana University : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
భీంగల్లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్శిటీ వీసీ దాచేపల్లి రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనివర్సిటీ వీసీ డబ్బులకు కక్కుర్తి పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.