Ravichandran Ashwin : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. చాలామంది ఫ్యాన్స్.. టీమ్లో అశ్విన్ ఉండుంటే వేరేవిధంగా ఉండేదని, తను టీమ్ను గెలుపు వైపు నడిపించేవాడు అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీనియర్ మాజీ టీమిండియా ప్లేయర్లు సైతం ఈ విషయంలో వారి అభిప్రాయాలను బయటపెట్టారు. కానీ అశ్విన్ మాత్రం ఇప్పటివరకు దీని గురించి ఏమీ మాట్లాడలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించడానికి ముందుకొచ్చాడు.
టీమ్మేట్స్ అనేవారు ఫ్రెండ్స్లాగా ఉండడం లేదు కేవలం కొలీగ్స్ లాగా మారిపోయారు అంటూ తన బాధను బయటపెట్టాడు రవిచంద్రన్ అశ్విన్. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తనను చాలా బాధకు గురిచేశాయని అన్నాడు. తనకు ఓవర్థింకర్ అనే లేబుల్కు తగిలించి, తన తోటి టీమ్మేట్స్.. తనకు కెప్టెన్సీ రాకుండా ఎలా అడ్డుకున్నారో చెప్పాడు. తాను బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ను ఎంచుకునే తప్పు పని చేశానని ఫీల్ అయ్యాడు. ఆఫ్ స్పిన్ బౌలర్గా మారినప్పటి నుండి ఇదంతా మొదలయ్యిందని అన్నాడు.
తాను బ్యాటింగ్ విషయంలో బాగానే ఆట కనబరిచాడని గుర్తుచేసుకున్నాడు అశ్విన్. ఎప్పటికీ బౌలర్ కాకుండా ఉండాల్సిందని వాపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ నుండి తనని తొలగించడం ఎదురుదెబ్బ లాంటిదే అని, కానీ ఇలాంటివి తను చాలా చూశానని అన్నాడు. తన సిన్సియారిటీని ప్రతీసారి ఓవర్థింకింగ్ అని హేళన చేసేవారని బయటపెట్టాడు. ప్రతీ గేమ్ నుండి తొలగిస్తూ ఉండడం, తన గురించి తప్పుగా ఆలోచించడం అనేది తనను డిప్రెషన్ను గురిచేసిందన్నాడు. కానీ అవన్నీ మర్చిపోయాయని, ఇప్పుడు తను చాలా తృప్తిగా ఉన్నానని అన్నాడు అశ్విన్.