BCCI Hunting for Sponsor : ముఖ్యంగా క్రికెట్ రంగంలో ఏ స్పాన్సర్లు ఎప్పుడు మనసు మార్చుకొని తప్పుకుంటారో తెలియదు. కానీ దానికి తగినట్టుగానే ఖాళీగా ఉన్న స్పాన్సర్షిప్ను అందుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలు అన్నీ క్యూ కడతాయి. ఐపీఎల్లోనే కాదు నేషనల్ క్రికెట్ టీమ్ విషయంలో కూడా స్పాన్సర్షిప్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. తాజాగా నేషనల్ టీమ్ను సపోర్ట్ చేయడం కోసం టెండర్లకు ఆహ్వానం పలికింది బీసీసీఐ.
ఆసక్తి ఉన్న బిజినెస్ హైజ్లు అన్ని స్పాన్సర్షిప్ కోసం టెండర్లను అప్లై చేసుకోవచ్చని బీసీసీఐ ప్రకటించింది. గత ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎడ్యుకేషన్ బిజినెస్లో క్రేజ్ సంపాదించుకున్న ‘బైజూస్’.. టీమ్కు స్పాన్సర్గా వ్యవహరించింది. ఇండియన్ మెన్ టీమ్ కోసం 35 మిలియన్ డాలర్ల డీల్ను మాట్లాడుకుంది బైజూస్. ఆ రేంజ్లో పెట్టుబడి పెట్టింది కాబట్టే.. బైజూస్కు మెన్ టీమిండియా జెర్సీల వల్ల సరిపడా ప్రమోషన్ లభించింది.
నేషనల్ టీమ్ లీడ్కు స్పాన్సర్ రైట్స్ కోసం బీసీసీఐ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఈ వేలాన్ని కావాల్సిన డాక్యుమెంట్ ధర రూ.5 లక్షలు అని, ఇది నాన్ రిఫండెబుల్ అని బీసీసీఐ ఈ ప్రకటనలో తెలిపింది. ఈ డాక్యుమెంట్ను కొనడానికి చివరి తేదీ జూన్ 26 అని తెలిపింది. ముందుగా ఐటీటీని కొనుక్కొని, రూల్స్ను పాటించిన వారు ఎవరైనా.. ఈ బిడ్లో పాల్గొనవచ్చని బీసీసీఐ ప్రకటనలో తేల్చింది.