Earthquake : ఉత్తరాదిలో భూకంపం అలజడి సృష్టించింది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జమ్మూకశ్మీర్ లోని దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎర్త్ కేక్ తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా రికార్డైంది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ , పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. హస్తినలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. చండీగఢ్, పంజాబ్ లో ప్రకంపనలు కనిపించాయి.