Shirisha : వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్లో జరిగిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతురాలి బావ, కొంతమంది అనుమానితులను విచారిస్తున్నారు. శనివారం రాత్రి శిరీష ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీస్తున్నారు. యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టం పూరైంది. ఆ తర్వాత మృతదేహాన్ని శిరీష అన్న శ్రీకాంత్కు పోలీసులు అప్పగించారు.
శిరీష బావ అనిల్ ఈ దారుణానికి ఒడిగట్టునట్టు ఆరోపణలు వస్తున్నాయి. శిరీష ఫోన్ ఎక్కువగా వాడుతుండటంతో ఆమె సోదరుడు తిట్టినట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన అక్క భర్త అనిల్ కూడా శిరీషను కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైందని సమచాారం. ఆ తర్వాతే ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది.
ఇంటికి కిలోమీటర్ దూరంలోని నీటి కుంటలో శిరీష మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు కోసి, కళ్లలో స్క్రూడ్రైవర్తో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమెను ఒక్కరే చంపి ఉంటారని భావించడం లేదని పోలీసులు చెబుతున్నారు. శిరీష తండ్రి, సోదరుడిని కూడా ప్రశ్నించారు.