Bioterrorism : ప్యాండమిక్ అంటే అది ఒక ఆరోగ్య సమస్య మాత్రమే అవ్వాల్సిన అసవరం లేదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన ఏదైనా అయ్యిండవచ్చు. ప్రస్తుతం ప్రపంచ దేశాల అన్నింటి మధ్య బయోటెక్నాలజీ వార్ నడుస్తోంది. మరో ప్యాండమిక్ అనేది వస్తే.. అది ఈ వార్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తాజాగా బయటపెట్టారు. దీంతో ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అందరూ ఒక్కసారిగా వారు కామెంట్స్పై దృష్టిపెట్టారు. వాటిని ఖండించలేకపోయారు.
కోవిడ్ 19 అనేది అసలు ప్యాండమిక్ అంటే ఏంటి అని అందరికీ తెలిసేలా చేసింది. ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యేలా చేసింది. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు అనేవి మనిషి శరీరంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. మైక్రోబ్స్, పాథోజెన్స్ లాంటి బ్యాక్టీరియా అనేది మనం తినే ఆహారంలోకి చేరి మనల్ని అనారోగ్యం బారిన పడేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ఆరోగ్యంపై ప్రభావం పడేవరకు మనుషులకు వాటి ఎఫెక్ట్ తెలియదన్నారు.
కోవిడ్ తర్వాత అసలు మనుషులకు ఆరోగ్యపరంగా ఎలాంటి రిస్కులు అనేవి ఉన్నాయి. రేడియోలాజికల్గా, బయోలజికల్గా వారికి ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేవాటిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. దీని గురించి ప్రపంచ దేశాలు అనేవి ఒక సమావేశంలో మాట్లాడనున్నాయి. అధికారులు నేరుగా కాకుండా వర్చువల్గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కామన్గా ఎదుర్కునే సమస్యల గురించి చర్చలు జరగునున్నాయి.
బయోడిఫెన్స్, ఎమర్జెన్సీలకు సిద్ధంగా ఉండడం, వాతావరణ ఆరోగ్యం.. ఇలాంటి పలు టాపిక్స్పై సమావేశంలో చర్చించనున్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అందరూ అనుకుంటున్నారు. దానికి ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడుకోనున్నారు. కోవిడ్ తర్వాత టెక్నాలజీలు అనేవి మరింత విపరీతంగా పెరిగిపోయాయి. కానీ ఇవి పూర్తిస్థాయిలో మానవాళికి సాయం చేస్తాయా లేదా, వీటి వల్ల కలిగే హాని ఏంటి అని చాలామంది ఆలోచించలేకపోతున్నారు.