Bigg Boss 6 : బిగ్ బాస్ తెలుగు మేకర్స్కు ఊహించని షాక్ తగిలింది. బిగ్బాస్ షో ప్రసారాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఏపీ హైకోర్టు అక్కినేని నాగార్జునకు, బిగ్బాస్ షో నిర్వహిస్తున్న ఎండెమోల్ ఇండియా డైరెక్టర్కు, స్టార్ మాటీవీ ఎండీకి, ఏపీ డీజీపీ, హోం కార్యదర్శకి నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. బిగ్బాస్ తెలుగు షోలో అశ్లీలత, హింస పెరిగిపోయాయని.. తక్షణం ఈ ప్రసారాలను నిలిపివేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.
బిగ్బాస్ 6 తెలుగు షోలో అశ్లీలత శృతిమించిందని.. సెన్సార్ చేయకుండా ప్రసారం చేస్తున్నారని పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. బిగ్బాస్ లాంటి ఏ గ్రేడ్ షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 లోపు మాత్రమే ప్రసారం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని అన్నారు.