Shiva Lingam : ఏ పూజ అయినా తొలుత పూజలందుకునేది వినాయకుడే. ఆదిదేవుడు విఘ్నేశ్వరుడి పూజతోనే ఏ కార్యక్రమం అయినా మొదలవుతుంది. తమిళనాడులోని పిళ్లైయార్ పట్టి వినాయక క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాడు గణనాథుడు. తిరుప్పత్తూరు సమీపంలోని ఈఆలయం సువిశాలంగా నిర్మించారు. నాటి వైభవానికి అద్దం పడుతూ. స్వామివారి మహిమలకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. ఎత్తైన గాలిగోపురం, వివిధ ఉపాలయాలు .. మంటపాలతో ఈ ప్రాంతం అడుగడునా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది.
సాధారణంగా వినాయకుడు .. ఒక చేతిలో ఉండ్రాయిగా చెప్పుకునే లడ్డు పట్టుకుని కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో స్వామివారి చేతిలో శివలింగం ఉంటుంది. వినాయకుడి చేతిలో శివలింగం వెనుక పెద్ద కథే ఉంది. శివుడి వరంతో తనను ఎవరూ చంపలేరన్న గర్వంతో గజముఖాసురుడు రెచ్చిపోయి ఆగడాలు సృష్టిస్తాడు. దేవతల్నిసైతం వదలడు. చివరకి సమస్త దేవతల వినాయకుడి వద్దకి వెళ్లి తమ బాధను చెప్పుకుంటారు. అసురుడు వినాయకుడితో యుద్ధం సమయంలో చిక్కడు దొరకడు అన్నట్టు కాసేపు ఆడుకుంటున్నాడు. చివరకు ఎలుక రూపంలో పారిపోవడానికి ప్రయత్నించి చనిపోతాడు. ఆ సమయంలో తనకు వినాయకుడి వాహనంలా ఉండేందుకు వరం ఇవ్వమని కోరతాడు. విఘ్వేశ్వరుడి అనుగ్రహంతో అతని కోరిక నెరవేరుతుంది.
గజముఖాసురుడిని చంపిన దోష నివారణకి వినాయకుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అసుర సంహారం చేసిన ఇక్కడి స్వామిని కర్పగా వినాయకుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా సాగిపోతుందని భక్తుల విశ్వాసం.