Disappearing ice : వాతావరణ మార్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా పెరిగిపోతున్నాయి. దీనికి గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం లాంటివి కారణమని తెలిసినా శాస్త్రవేత్తలు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే దాని వల్ల కలుగుతున్న నష్టాలను చూస్తూ ఉండడం తప్పా ఏమీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా రానున్న పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భయంకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందులో ఒకటి ఆర్క్టిక్లో ఐస్ కనుమరుగయిపోవడం.
వాతావరణ మార్పులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకున్నా ఆర్క్టిక్లో ఐస్ అనేది కరిగిపోవడానికి కనీసం రెండు దశాబ్దాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఒక దశాబ్దం లోపే ఇక్కడ ఐస్ అనేది కనిపించకుండా పోయే అవకాశం ఉందని వారు బయటపెట్టారు. ఇది మరింత వాతావరణ తీవ్రతకు దారితీస్తుందన్నారు. కాలుష్యం వల్ల భూమి అంతా వేడిగా అయిపోతుందని, దాని వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 2030లో సెప్టెంబర్ వచ్చేవరకు ఆర్క్టిక్లో ఐస్ అనేది ఉండదని వారు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఇప్పుడు అవుతున్న స్పీడ్లో భూమి అనేది వేడి అవ్వకపోయినా కూడా 2050 వరకు ఆర్క్టిక్ ఐస్ తప్పకుండా కనుమరుగయిపోతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. 1979 నుండి 2019 వరకు వాతావరణంలో వచ్చిన మార్పులను క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వచ్చారు. ఆర్క్టిక్ సముద్రంలో వస్తున్న మార్పుల గురించి శాటిలైట్ డేటాతో పాటు పలు క్లైమెట్ మోడల్స్ను కూడా సేకరించి స్టడీ చేసి చూశారు. అందుకే ఎప్పటికైనా ఆర్క్టిక్ సముద్రంలోని ఐస్ కరిగిపోక తప్పదని వారు చెప్తున్నారు.
శాస్త్రవేత్తలు కాలుష్యాన్ని, వేడిని తగ్గించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆర్క్టిక్ ఐస్ను కాపాడడం తమ వల్ల కావడం లేదని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ప్రస్తుతం చలికాలంలో సముద్రం మీద ఐస్ అనేది ఏర్పడి.. వేసవి వరకు అది కరిగిపోతుందని, కానీ త్వరలోనే ఐస్ అనేది అసలు ఏర్పడకుండా ఉండడం అనేది వాతావరణ మార్పులలోని తీవ్రతను తెలిసేలా చేస్తుందని వారు అంటున్నారు. ఆర్క్టిక్ సముద్రంలోని ఐస్ పూర్తిగా కరిగిపోవడం వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలకు, జీవాలకు పలు రకాలుగా నష్టం కలగడం తప్పదని వారు తెలిపారు. పోలార్ బీర్స్, వాల్రసెస్, రెయిన్డీర్ వంటి వాటి జీవనం కష్టంగా మారుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.