Kedarnath Temple : కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు మూసివేశారు. శీతాకాలం కావడం, మంచు బాగా కురుస్తుండ్డంతో ఆలయాన్ని మరో ఆరు నెలలపాటు మూసివేయనున్నరు. మూసివేసే ముందు ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. ఈ పూజలో సుమారు 3వేల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రలో 43 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 15 లక్షల మంది కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యమునోత్రి ఆలయాన్ని గురువారం రోజు మూసివేయగా.. గంగోత్రి ఆలయాన్ని బుధవారమ్ మూసివేశారు.
బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేయనున్నారు. శీతాకాలం కావడంతో కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోతాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.