EPAPER

TTD Temple : నవీ ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.. .రూ.100 కోట్ల వ్యయం..

TTD Temple : నవీ ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి శ్రీకారం.. .రూ.100 కోట్ల వ్యయం..


TTD Temple : నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ టెంపుల్ భూమిపూజ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.

తిరుమల తరహాలో నవీ ముంబైలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీ ముందుకు రావడంపై ఏక్‌నాథ్‌ షిండే సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆలయం నిర్మించనుండటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నామన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయం ద్వారా దర్శనభాగ్యం కలుగుతుందన్నారు.


శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.ఈ ఆలయ నిర్మాణానికి రూ. 100 కోట్ల ఖర్చు అవుతుందని వెల్లడించారు.

Tags

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×