Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గిల్గిట్, బల్టిస్థాన్లను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. శ్రీనగర్లో జరిగిన శౌర్య దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతన్నాయన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు తరువాతే కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు రాజ్నాథ్ సింగ్.
భారతపై తొలిసారి 1947 అక్టోబర్ 27న దాడి జరిగింది. ఆ సమయంలో సిక్కు రెజిమెంట్ 1 అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. అదే సమయంలో వాయుసేనకు చెందిన తొలి విమానం శ్రీనగర్లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వాయుసేన ఆర్మీ కలిసి శౌర్యదివస్ను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. ఉగ్రవాదుతు, శతృ మూకలకు హెచ్చరికలు జారీ చేశారు.