EPAPER

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాంటిగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9 పరుగులు) మరోసారి నిరాస పర్చాడు. అయితే రోహిత్ ( 53), కోహ్లీ (62) , సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 180 పరుగులతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. వరస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలింది. రోహిత్ సేన 56 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ , అశ్విన్ రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. వరసగా రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా గ్రూప్2 లో అగ్రస్థానంలో ఉంది. 25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా- దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×