Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ప్రభావం ఇతర రైలు సర్వీసులపై పడింది. ఈ ఘటన నేపథ్యంలో 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 38 రైళ్లను టాటానగర్ స్టేషన్ మీదుగా మళ్లించినట్లు ప్రకటించారు. హౌరా – పూరీ సూపర్ఫాస్ట్, హౌరా -బెంగళూరు సూపర్ఫాస్ట్, హౌరా -చెన్నై మెయిల్, హౌరా -సికింద్రాబాద్, హౌరా -హైదరాబాద్, హౌరా -తిరుపతి, హౌరా -పూరీ సూపర్ఫాస్ట్ , హౌరా -సంబల్పుర్ ఎక్స్ప్రెస్ , సంత్రగాచి-పూరీ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు బెంగళూరు – గువాహటిరైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్పుర్ డివిజన్లో ఉన్న చెన్నై సెంట్రల్-హావ్డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్, సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ఇక ఒడిశా ఘటనతో గోవా-ముంబై వందేభారత్ సర్వీస్ ప్రారంభం వాయిదా పడింది. ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్ రైల్వే అధికారులు ప్రకటించారు.