EPAPER

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ప్రభావం ఇతర రైలు సర్వీసులపై పడింది. ఈ ఘటన నేపథ్యంలో 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 38 రైళ్లను టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మళ్లించినట్లు ప్రకటించారు. హౌరా – పూరీ సూపర్‌ఫాస్ట్‌, హౌరా -బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌, హౌరా -చెన్నై మెయిల్‌, హౌరా -సికింద్రాబాద్‌, హౌరా -హైదరాబాద్‌, హౌరా -తిరుపతి, హౌరా -పూరీ సూపర్‌ఫాస్ట్‌ , హౌరా -సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ , సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు బెంగళూరు – గువాహటిరైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇక ఒడిశా ఘటనతో గోవా-ముంబై వందేభారత్‌ సర్వీస్ ప్రారంభం వాయిదా పడింది. ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.


Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×