Telangana new secretariat news(Telugu news updates): కొత్త సచివాలయానికి వాస్తు దోషాలున్నాయా? ప్రారంభించి నెల రోజులు పూర్తి కాలేదు.. అప్పుడే మార్పులు చేస్తున్నారా? అసలే సీఎం కేసీఆర్ కు వాస్తు విశ్వాసాలు ఎక్కువే. అందుకే పాత సచివాలయంలో అడుగు కూడా పెట్టలేదు. అయితే కొత్తగా అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయానికి కూడా వాస్తు దోషాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు సీఎం కేసీఆర్.. ఈస్ట్ గేట్ వెంబడి.. సెక్రటేరియట్ లోకి వెళ్లేవారు. కానీ బుధవారం నుంచి వెస్ట్ ఎంట్రన్స్ నుంచి లోనికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బుధవారం నుంచి పశ్చిమ మార్గంలో సచివాలయంలోకి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు ఆగమేఘాలపై వెస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు వేయడంతో పాటు చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అయితే సీఎం భద్రతాధికారులు మాత్రం.. మార్పుల విషయంలో వేరే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ ను తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.