BJP: మత మార్పిడులకు పాల్పడితే బుల్లెట్లు దించుతామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఆదిలాబాద్లో జనజాతి సురక్ష సభలో ప్రసంగించారు. కొందరు ముస్లిం పెద్దలు, పాస్టర్లు.. గిరిజనుల మత మార్పిడులకు పాల్పడుతున్నారని సోయం ఆగ్రహం వ్యక్తం చేశారు.
జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దాదాపు 12 మంది పాస్టర్లు ఉన్నారని.. ఇప్పటివరకు 12 వందల మంది ఆదివాసీలను మతం మార్చారని ఆరోపించారు. మతం మారిన వారు వెంటనే తిరిగి రావాలని.. లేకపోతే వారికి రిజర్వేషన్ కోల్పోయేలా చేస్తామని చెప్పారాయన. అదివాసీలను పెళ్లిళ్ల పేరుతో మతం మార్చుతున్నారని.. ఆ మహిళల పేరుపై భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుని కొల్లగొడుతున్నారని అన్నారు.