vastu tips : భూమి మీద బతికే ప్రతీ ఒక్కరు ఎంత కష్టపడినా ఏం చేసినా కడుపు నింపుకోవడానికే. నాలుగు మెతుకులు తినడానికే. అలాంటి బియ్యంలో ఇంట్లో ఎక్కడపెడితే అక్కడ ఉంచకూడదు. బియ్యంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. పూజలో దేవత ఆరాధానకు ఉపయోగించే అక్షింతలు తయారు చేసుకునేది బియ్యం నుంచేనన్న సంగతి పెట్టుకోవాలి. పసుపు, ఆవునెయ్యి, బియ్యం కలిపితేనే అక్షితలు వస్తాయి. అక్షింతలు అంటే ఆశీర్వాదాలు.
వాస్తు శాస్త్రంలో వంటికి గది గురించి ప్రత్యేకంగా చెప్పారు. కిచెన్ లో ఏ సామాన్లు ఎక్కడ పెట్టుకుంటే మంచిదో వివరంగా చెప్పారు. వంటగదిలో బియ్యం మూటను లేదా డబ్బాను ఎలా పడితే అక్కడ ఉంచకూడదు. తెలుపు రంగు పదార్ధాలతో శుక్రుడు ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి మూలన బరువు పెట్టాలంటారు. కానీ అక్కడ బియ్యం డబ్బా పెడితే అందులో నుంచి ప్రతీ రోజు బియ్యం తీయాల్సి ఉంటుంది. బరువు పెట్టినప్పుడు అది స్థిరంగా ఉండాలి. కానీ రైస్ విషయంలో సాధ్యం కాదు. కాబట్టి అందుకే బియ్యాన్ని ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. అలా చేస్తే ఆహారానికి లోటు ఉండదు. ఈ నియమాన్ని పాటించకపోతే డబ్బు ఉన్నా కొనలేని పరిస్థితులు వస్తాయి. చేయడం వల్ల ఇల్లు ధనధాన్యాలతో నిత్యం వర్దిల్లుతుంది.
ఆగ్నేయం దిక్కులో పెట్టిన బియ్యం తిన్న ఇంటి వారికి తేజస్సు, ఆయుష్షు కలుగుతాయి.నైరుతిలో కానీ బియ్యం పబెడితే ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఆలుమగల మధ్య దూరం పెరుగుతుంది.