EPAPER
Kirrak Couples Episode 1

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..

RBI : అందుకే రూ. 2 వేల నోటు ఉపసంహరణ.. రూ. 50 వేల డిపాజిట్ కు పాన్ తప్పనిసరి.. ఆర్బీఐ క్లారిటీ..

RBI : రూ. 2 వేల నోట్ల మార్పిడిపై బ్యాంకు ఖాతాదారుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గుర్తు చేశారు. అదే నిబంధన రూ.2 వేల నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందన్నారు.


నగదు నిర్వహణలో భాగంగానే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని శక్తికాంత్ దాస్‌ వెల్లడించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడానికే రూ.2 వేల నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని వివరించారు.

సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2 వేల నోట్లు ఖజానాకు చేరతాయని తాము ఆశిస్తున్నామని శక్తికాంత్ దాస్‌ తెలిపారు. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే రూ.2 వేల నోట్లను స్వీకరించడంలేదన్నారు. ఉపసంహరణ ప్రకటన తర్వాత అది మరింత ఎక్కువై ఉంటుందని అభిప్రాయపడ్డారు.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×