EPAPER

Telangana : తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana :  తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana : తెలంగాణలో వారంరోజులుగా ఎండలు దంచేశాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదైంది నల్లగొండలో 42.5 డిగ్రీలు నమోదైంది.


ఒకే గ్రామంలో వడదెబ్బ బారిన పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు , బేతం చిన్ని , తన్నీరు మనోహర్‌ వడదెబ్బతో మృతి చెందారు.

శనివారం నుంచి భానుడు శాంతించనున్నాడు. రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల వచ్చే మూడు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×