Shobita Dhulipala:- నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతుంది. అయితే కూడా ఇప్పటికీ వారిపై సోషల్ మీడియాలో ఎవో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీలున్నప్పుడల్లా సమంత, నాగ చైతన్యలు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయితే వారిద్దరితో పాటు వారి కారణంగా వార్తల్లో మరో వ్యక్తిగా నిలుస్తున్నారు. అదెవరో కాదు.. శోభితా ధూలిపాళ. అందుకు కారణం.. సమంత నుంచి విడిపోయిన నాగ చైతన్య ఆమెతో డేటింగ్ ఉన్నాడంటూ వార్తలు రావటమే.
చైతన్య, శోభిత ముంబైలో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ ఫొటోలతో సహా వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా హీరోయిన్ శోభితా ధూలిపాళ వాటిపై తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చేసింది. ‘‘నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మీడియా ముందుకు అనవసరంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం కెరీర్లో మంచి ఫేజ్ను ఎంజాయ్ చేస్తున్నాను. మణిరత్నంగారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అలాగే ఎ.ఆర్.రెహమాన్గారి మ్యూజిక్లో పాటలకు డాన్సులేశాను. నటిగా ఎంజాయ్ చేస్తున్నాను’’ అని శోభితా ధూలిపాళ నాగ చైతన్యతో తనపై వస్తోన్న డేటింగ్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇకనైన సోషల్ మీడియాలో నాగ చైతన్య, శోభితల డేటింగ్ పై రూమర్స్ రావటం ఆగిపోతాయేమో చూడాలి.
వైజాగ్కి చెందిన శోభిత తెలుగు నేలతో ఉన్న రిలేషన్ గురించి కూడా గొప్పగా మాట్లాడింది. వైజాగ్లో తనకు సొంత ఇల్లు కూడా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలియజేసింది. రీసెంట్గా శోభితా ధూలిపాళ నటించిన పొన్నియిన్ సెల్వన్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో ఆమె జయం రవికి జంటగా నటించింది. మరో వైపు ఆమె ఓటీటీలోనూ ది నైట్ మేనేజర్ వంటి వంటి వెబ్ సిరీస్లలో ప్రేక్షకులను తనదైన పాత్రలతో మెప్పిస్తూనే ఉంది. ది నైట్ మేనేజర్ సీజన్ 2 త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.