BJP : తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్-భజరంగ్దళ్ కార్యకర్తలు పోటాపోటీ నిరసనలు చేశారు. భజరంగ్దళ్ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గాంధీభవన్ ఎదుట హనుమాన్ చాలీసాను భజరంగ్దళ్ కార్యకర్తలు పఠించి నిరసన తెలిపారు.
భజరంగ్దళ్ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయానికి బీజేపీ నేతలు ర్యాలీగా బయల్దేరగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీజేపీ నేతలకు తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. రోడ్డుపైనే బీజేపీ శ్రేణులు బైఠాయించి హనుమాల్ చాలీసాను పఠించాయి. ఖమ్మంలో బీజేపీ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.