EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : భాగ్యనగరంలో మరో విషాదం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. కాకినాడకు చెందిన భీమ్‌శంకర్‌ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ బైక్‌షోరూంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది. అతడి కుమారుడు వివేకానంద ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.


రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆరేళ్ల వివేకానంద పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకునేలోపే బాలుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఎస్ఐ దాలి నాయుడు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల సికింద్రాబాద్ లో మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో బాలుడు నీటి గుంతకు బలైపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×