TS Secretariat: తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా కొత్త సచివాలయం నిర్మించింది. ఏప్రిల్ 30న ప్రారంభోత్సవం కూడా జరగనుంది. కానీ సచివాలయంలో తెలంగాణ మంత్రులకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు అందరూ వాస్తు నియమాలు తూచ తప్పకుండా పాటిస్తారు. ఇదే ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ లో మంత్రులకు తలనొప్పిగా తయారైంది. మంత్రులకు చాంబర్ల కేటాయింపు విషయంలో చిక్కు వచ్చి పడింది.
మంత్రుల చాంబర్ల కేటాయింపులో ‘వాస్తు’ తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఎవరికి వారు నచ్చిన చాంబర్ల కోసం పైరవీలు మొదలు పెట్టారంటున్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఝానంతో నిర్మించిన నూతన సచివాలయంలో మంత్రులు తమకు నచ్చిన అంతస్థులను కేటాయించాలని మంత్రులు కోరుతున్నారు. అది కూడా సెంటి మెంట్ కు అనుగుణంగా వాస్తు ప్రకారంగా ఉండాలని అధికారులపై మంత్రులు ఒత్తిడి పెంచుతున్నట్లు సమచారం. మంత్రుల ఒత్తిడితో అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 30న ప్రారంభానికి సంబంధించి షిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా తాత్కాలికంగా కొన్ని శాఖలకు చాంబర్లు కేటాయించినట్లు తెలుస్తుంది.
కొత్త సచివాలయంలో ఆరో ఫ్లోర్లో సిఎం కార్యాలయంతో పాటు సిఎస్కు చాంబర్ల కేటాయింపు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూ, మొదటి ప్లోర్లో హోం, రెండో అంతస్థులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్, ఎస్సీ డెవలప్మెంట్ , నాలుగో అంతస్థులో ఇరిగేషన్, ఐదో అంతస్థులో సాధారణ పరిపాలన శాఖలకు కేటాయించారు. తాత్కాలికంగా కేటాయింపులు జరిగినా కొంత మంది కీలక మంత్రులు తమకు నచ్చిన చాంబర్లు కేటాయిచలేదన్న అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. కావాల్సిన చాంబర్ కోసం ఒకరికి మించి ఒకరు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో మంత్రుల మధ్య చాంబర్ల కేటాయింపు ఆధిపత్య ధోరణిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రుల పైరవీలు అధికారులకు తలనొప్పిగా మారాయి.