Hyderabad: హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. రోడ్డు దాటాలంటే బాగా టాలెంట్ ఉండాల్సిందే. ఇక రద్దీగా ఉండే జంక్షన్లో మరింత రిస్క్. ఇటు నుంచి అటు వెళ్లడమనేది మీ సత్తాకు ఛాలెంజ్ విసురుతుంది. అట్లుంటది హైదరాబాద్. అందులో ఉప్పల్ జంక్షన్ మరింత ఫేమస్. చాలా పెద్ద జంక్షన్. నాలుగు కీలక ప్రాంతాలను కలిపే చౌరస్తా కావడంతో.. నిత్యం ఫుల్ ట్రాఫిక్. అలాంటి చోట రోడ్డు దాటడమంటే.. కొత్త వాళ్లకు కంగారే. పాత వాళ్లకూ పరేషానే.
ఇకపై ఉప్పల్ జంక్షన్లో వర్రీ అవసరం లేదంటున్నారు మంత్రి కేటీఆర్. పాదచారుల కోసం స్కైవాక్ నిర్మించారు. నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా రూపొందించిన ఆకాశ వంతెన త్వరలోనే నగరవాసులకు అందుబాటులోకి రానుంది.
వందేళ్ల అవసరాలకు యూజ్ అయ్యేలా ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు డిజైన్ చేశారు. స్కైవాక్ నిర్మాణం కోసం వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు.
స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు. స్కైవాక్లో భాగంగా లిఫ్ట్, ఎస్కలేటర్స్, మెట్లు నిర్మించారు. మొత్తం ఆరు చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.
ఉప్పల్ స్కైవాక్ కోసం 25 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.