EPAPER
Kirrak Couples Episode 1

Indian Army: ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. గ్రెనేడ్ విసరడంతో ఐదుగురు జవాన్లు బలి..

Indian Army: ఆర్మీ ట్రక్‌పై ఉగ్రదాడి.. గ్రెనేడ్ విసరడంతో ఐదుగురు జవాన్లు బలి..
army-truck-fire-accident

Indian Army: ఆర్మీ జవాన్లు. జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారంతో ఆర్మీ ట్రక్కులో వెళ్తున్నారు. అంతలోనే ఏదో పిడుగుపడిన ఫీలింగ్.


సడెన్‌గా ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు విజృంభించాయి. ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

మొదట ఇది ప్రమాదం కావొచ్చని అనుకున్నారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతోంది. అందుకే, పిడుగు పడిందేమోనని సందేహించారు. అసలే పూంచ్ సెక్టార్ కావడంతో ఎందుకైనా మంచిదని విచారణకు ఆదేశించింది ఆర్మీ. ఉగ్ర కోణం ఉందేమోనని ఆరా తీసింది.


ఆర్మీ అధికారుల అనుమానమే నిజమైంది. వర్షం మాటున ఉగ్రవాదులు నక్కారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్లు విసిరారు. గ్రెనేడ్ దాడికి ట్రక్కు కాలిపోయింది. అందులోని జవాన్లు సజీవ దహనం కావడం కలకలం రేపుతోంది.

వెంటనే అప్రమత్తమైన ఆర్మీ.. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. పూంచ్, జమ్మూ రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.

Related News

Atishi Marlena Oath: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణ స్వీకారం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

RahulGandhi reacts: తిరుమల లడ్డూ వివాదం.. రాహుల్‌గాంధీ రియాక్ట్, నెయ్యిపై సీఎం సిద్దరామయ్య..

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Big Stories

×