EPAPER

Kakinada : అమ్మ అని పిలిస్తే చావు నుంచి తిరిగొచ్చింది.. ఆ తర్వాత ఏమైందంటే..?

Kakinada : అమ్మ అని పిలిస్తే చావు నుంచి తిరిగొచ్చింది.. ఆ తర్వాత ఏమైందంటే..?

Kakinada : ఆమె పేరు అనపర్తి వీరవెంకట కనకదుర్గ అఖిల. కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత శనివారం పదో తరగతి చివరి పరీక్ష విధులకు హాజరై తిరిగి వస్తుండగా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ లారీ ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. దీంతో అఖిల తీవ్రంగా గాయపడ్డారు.వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అని తేల్చారు.


సహచర ఉపాధ్యాయుల తో కలిసి ‘సంకల్పం’ పేరిట స్వచ్ఛంద అఖిల సేవలు చేసేవారు . మరణాంతరం అవయవదానానికి ముందుగానే ఆమె అంగీకారం తెలపారు. దీంతో వైద్యులు ఆమె బాడీ నుంచి అవయవాలు సేకరించేందుకు సన్నద్ధమయ్యారు. ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చేయి కొద్దిగా కదపడంతో అఖిల బతుకుతుందని కుటుంబ సభ్యులు ఆశపడ్డారు.

అఖలకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మా అంటూ పిలిపించారు. ఆ మాటలకు మరోసారి చేయి కదపడంతో వెంటనే అవయవ దానాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత అఖిల కొంత కోలుకున్నారు. ఇంతలోనే ఆమె పరిస్థితి మళ్లీ విషమించింది. బుధవారం సాయంత్రం అఖిల అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణంతో కుటుంబసభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరయ్యారు. అమ్మ మళ్లీ తనను ఎత్తుకుంటుందని, గోరుముద్దులు తినిపిస్తుందని ఆశపడ్డ ఈ చిన్నారికి ఇక అమ్మరాదు అని తెలియక అమాయకంగా దిక్కులు చూస్తున్నాడు. పాపం పసివాడు తల్లిలేని బిడ్డయ్యాడు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×