Suriya:- కోలీవుడ్ హీరోల్లో చాలా మంది ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు, చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంటే హీరో ఏమో కోలీవుడ్ వ్యక్తి అయితే దర్శక నిర్మాతలు మన తెలుగు వారు అయ్యుంటారన్నమాట. అయితే ఇదంతా వారు తమ మార్కెట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే చేస్తారు. అయితే ఇప్పటికే తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ హీరో సూర్య. ఈయన తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తానని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ సెట్ కాలేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినీ సర్కిల్స్లో వినిపిస్తోన్న వార్తల మేరకు సూర్య త్వరలోనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేయబోతున్నారు.
వివరాల్లోకి వెళితే రీసెంట్గా కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు చందు మొండేటి చాలా రోజుల నుంచి గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సి ఉంది. మంచి హీరో సెట్ కావటం లేదు. తెలుగులో కొంత మంది హీరోలను ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశారు నిర్మాత అల్లు అరవింద్. కానీ ఏవీ వర్కవుట్ కాలేదు. దీంతో సూర్యను రీసెంట్గా కలిసి కథ నెరేట్ చేశారట చందు మొండేటి. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాక్.
సూర్య హీరోగా నటించి గజిని చిత్రం నుంచి తర్వాత ఆయనతో సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తుంది. అప్పటికే చేయాల్సిన సినిమాలు లైన్లో ఉండటం, సరైన ప్రాజెక్ట్స్ సెట్ కాకపోవటం వంటి కారణాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఈసారి మూవీ స్టార్ట్ కానుందని సినీ సర్కిల్స్ టాక్. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత వాడి వాసల్ సినిమా చేస్తారంటున్నారు. ఇంత బిజీగా ఉంటున్న సమయంలో కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ తెలుగు సినిమాకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తాడనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.