IPL: సన్డే ఫన్డే గా మారింది. ఐపీఎల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ టీ20 టేస్ట్ను మరోసారి రుచిచూపించింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
బ్యాటింగ్లో వెంకటేశ్ అయ్యర్ (104) చెలరేగి ఆడి సెంచరీ చేశాడు. ఈ సీజన్లో శతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్లతో చెలరేగిపోయాడు.
ఆండ్రూ రస్సెల్ (21*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో మెరుపులు మెరిపించాడు.
శార్దూల్ ఠాకూర్ (13), రింకు సింగ్ (18) రన్స్ చేశారు. ముంబైకి 186 పరుగుల టార్గెట్ ఇచ్చారు.
ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్ 2 వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్, డ్యూన్ జాన్సెన్, పీయూష్ చావ్లా, మెరిడిత్ ఒక్కో వికెట్ తీశారు.