Sitting Formalities On Floor:- కటిక నేలపై కూర్చోకూడదని హిందూ ఆచారంలో ఏనాటి నుంచి ఉంది. నేలపై కూర్చోవాల్సి వస్తే చిన్న గుడ్డ ముక్కయినా వేసుకుని కూర్చోవాలంటారు. రుషులు తప్పస్సు చేసే సమయాల్లో , హామాలు నిర్వహించే కార్యక్రమాల్లోను కటిక నేలపై ఆశీసును కారు. కనీసం పసుపు కలిపన అక్షింతలను తలపై జల్లుకుని కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కూర్చోవడానికి కుర్చీ, పీట, ఇదొక వస్త్రంతో చేసిన ఆసనం లేకపోతే దర్భాసనం, జింక చర్మం తో చేసిన ఆసనం ఏదోకటి భూమి మీద వేసుకుని కూర్చోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనిషి శరీరంలో ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. అది పై నుంచి కిందకు ఉత్పత్తి అయ్యి వెళ్తూ ఉంటుంది. అయితే ఒంట్లో పుట్టే విద్యుత్ బయటకు వెళ్ళేది సమానంగా ఉండాలి. అలా కాకపోతే శారీరక సమస్యలు ఏర్పడతాయని అంటారు.
అదే మనిషి ఆసనం మీద కూర్చుంటే శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇక అలా కాకుండా నెల మీద మీ లేకుండా అలా కూర్చుంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎక్కువ శాతం బయటకుపోతుంటుంది. అందుకే ఎలాంటి సమయాల్లోను భూమి మీద డైరెక్ట్ గా కూర్చోకూడదు. పూజ చేసినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, యోగాసనాలు వేయు సమయంలో, అన్నం తినే సమయంలో ఇలా ఏ సందర్భంలో నైనా కటిక నేల మీద కూర్చో కూడదు.
ఆసనాలు వేసేటప్పుడు కూడా కటికనేలపై చేయకూడదు.యోగా మ్యాట్ లు లేదా చాపలు లాంటి వేసుకుని పనిచేయాలి.