Panchamurthy:- హిందూ సంప్రదాయాల ప్రకారం ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు. సృష్టి స్థితి లయకి అనేక బాధ్యలు నిర్వహిస్తుంటారని నమ్మకం. కోటానుకోట్ల జీవులు నిత్యం పుడుతూ , చనిపోతూ, తిరిగి జన్మిస్తూ … ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వాటిని సమర్థవంతంగా నిర్వహించే పనని పంచమూర్తులు చేస్తుంటారు.
కోరిన కోర్కెలు తీర్చే వరప్రదాయకులు ఈ పంచమూర్తులు . చాలా మంది త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు మరో ఇద్దరు దేవతలని కలిపి పంచమూర్తులుగా చెబుతుంటారు. కానీ, పంచమూర్తులంటేవినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, పరమేశ్వరుడు , పార్వతీదేవి , చండికేశ్వరుడు . వీళ్ళ ఐదుగురిని కలిపి పంచమూర్తులుగా పిలుస్తారు.
ఏటా శివరాత్రి రోజున శ్రీకాళహస్తిలో పంచమూర్తులనూ ఊరేగిస్తారు . నందిపైన అయ్యవారు , కామధేనువు పైన జ్ఞానప్రసూనాంబగా అమ్మ మిగిలిన పంచమూర్తులూ వెంట తరలిరాగా కన్నుల పండుగగా పురవీధులలో ఊరేగుతూ దర్శనమిస్తుంటారు. .
కర్ణాటకలోని నంజనగూడులో శ్రీ కంఠేశ్వరుడు కూడా ఏడాదికి రెండుమార్లు జాతర జరుపుకుంటారు . తన పరివారమైన పంచమూర్తులతోనూ ఊరేగుతారు. కాబట్టి పంచమూర్తులు అంటే త్రిమూర్తుల స్వరూపాలుకాదు . విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు , జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడు , కార్యసాధకుడు , అనుగ్రహప్రదాత ఐన చండికేశ్వరుడు పరివారంగా పార్వతీ, పరమేశ్వరులని కలిపి పంచమూర్తులుగా పిలుస్తాంటారు. పంచ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.