EPAPER
Kirrak Couples Episode 1

KTR : అందువల్లే తెలంగాణ వచ్చింది.. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యం : కేటీఆర్

KTR : అందువల్లే తెలంగాణ వచ్చింది.. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యం : కేటీఆర్

KTR Latest Speech (TS News) : తెలంగాణలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లేకపోతే తెలంగాణ లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.


సీఎం కేసీఆర్‌ దమ్మున్న నేత అని కేటీఆర్ అన్నారు. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం ఆయనకే సాధ్యమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి కూడా అంబేడ్కర్‌ పేరే పెట్టాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. జాతికి దిశానిర్దేశం చేసేలా దాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్థానికుల డిమాండ్‌ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్‌ పేరు పెడతామని కేటీఆర్‌ ప్రకటించారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులర్పించారు. బాబాసాహెబ్ స్ఫూర్తితోనే తెలంగాణలో దళితబంధు పథకం అమలు చేస్తున్నామని స్పీకర్ పోచారం అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నామని స్పష్టంచేశారు.


Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×