Simon Dole’s comments : క్రికెట్ కామెంట్రీలో ఫేమస్ అండ్ కాంట్రవర్సియల్ పర్సన్ సైమన్ డౌల్. పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కామెంటేటర్గా ఉన్న సైమన్.. ఈమధ్య కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై బ్లాస్ట్ అయ్యాడు. పాకిస్తాన్లో నరకం అనుభవించానని చెప్పుకొచ్చాడు. పాక్లో ఉన్నంత కాలం కడుపు నిండా తిండి కూడా తినలేదని వాపోయాడు. అందులో భాగంగానే.. పాకిస్తాన్లో ఉండడం అంటే ఆల్మోస్ట్ జైల్లో ఉన్నట్టేనంటూ ఓపెన్ అయ్యాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జాల్మీ జట్టు తరపున కెప్టెన్ బాబర్ ఆజం ఆడుతున్నాడు. 83 పరుగుల వరకు బాగానే హిట్టింగ్ చేసిన బాబర్.. మిగిలిన 17 పరుగులు చేయడానికి 14 బాల్స్ తీసుకున్నాడు. క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన ఆ మ్యాచ్లో మొత్తానికి 115 పరుగులు చేశాడు. కాని, సెంచరీ కోసమే బాబర్ స్లోగా ఆడాడంటూ కామెంట్ చేశాడు సైమన్. ఇది బాబర్ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. ఎంతగా అంటే.. కామెంటేటర్ బాక్స్ నుంచి బయటికి రానివ్వనంతగా అడ్డుపడిపోయారు. ఫ్యాన్స్ గోల భరించలేక, బయటకు వెళ్లలేక, తిండి తినక.. దాదాపు జైల్లో ఉన్నట్టే నరకం అనుభవించానని చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్లో బాబర్ సెంచరీ చేసినప్పటికీ.. ఆ జట్టు ఓడిపోయింది.
మొన్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కొహ్లీ మీద కూడా ఇదే కామెంట్ చేశాడు. హాఫ్ సెంచరీ చేయడానికి, పర్సనల్ ఇమేజ్ పెంచుకోడానికి విరాట్ కొహ్లీ.. కావాలనే హాఫ్ సెంచరీ ముందు స్లోగా ఆడాడు అని కామెంట్ చేశాడు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 44 బాల్స్కు 61 పరుగులు చేశాడు కొహ్లీ. కాని, 42 పరుగుల నుంచి 50 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ 10 బాల్స్ తీసుకున్నాడు. దీన్ని తప్పుపట్టాడు సైమన్ డౌల్.