EPAPER
Kirrak Couples Episode 1

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..

Modi : ఆర్థిక నేరస్తులను వేగంగా అప్పగించండి.. బ్రిటన్ ను కోరిన మోదీ..


Modi : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఇరువురు ప్రధానులు కీలక అంశాలపై చర్చించారు. భారత్‌ వ్యతిరేక శక్తుల విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని రిషి సునాక్‌ను మోదీ కోరారు. బ్రిటన్ లోని భారత దౌత్య కార్యాలయాల భద్రతపై ఆందోళన వ్యక్తంచేశారు.

ఇటీవల బ్రిటన్ లో భారత హైకమిషన్‌పై జరిగిన దాడిని మోదీ ప్రస్తావించారు. ఖలిస్తానీ అనుకూలవాదులు లండన్‌లో భారత దౌత్య కార్యాలయంపై దాడి చేశారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. ఈ ఘటనలను రిషి సునాక్‌తో మోదీ ప్రస్తావించారు. భారత వ్యతిరేక శక్తులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్ దౌత్య కార్యాలయాల భద్రత విషయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హామీ ఇచ్చారు.


దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి బ్రిటన్ లో తలదాచుకుంటున్న వారిని భారత్ కు అప్పగించే విషయంపై చర్చించారు. ఆర్థిక నేరస్తులను అప్పగించే ప్రక్రియలో పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాలను ప్రధానులు సమీక్షించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సత్వరం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో జరిగే జి-20 సదస్సుకు హాజరుకావాలని రిషి సునాక్‌ను మోదీ ఆహ్వానించారు.

Related News

Punjab Woman: ముగ్గురు దొంగలకు మూడుచెరువుల నీళ్లు తాపించిన మహిళ.. తట్టుకోలేక చివరకు వాళ్లు… వీడియో

Jan Suraj Party : పార్టీ పేరు ప్రకటించిన పీకే… టార్గెట్ రూ.5 లక్షల కోట్లట!

Black Diwali for China: మనకు ‘దీపావళి’.. చైనాకు కారు చీకట్లు, ఆ నిర్ణయం ఊహించని దెబ్బకొట్టనుందా?

Rahul Gandhi| కొడుకు పెళ్లికి అంబానీ వేల కోట్లు ఖర్చు పెట్టాడు.. అదంతా ప్రజల సొమ్ము : రాహుల్ గాంధీ

SC on Demolitions: ‘దర్గా లేదు, దేవాలయం లేదు ప్రజల భద్రతే ముఖ్యం’.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!

Mahatma Gandhi Quotes 2024: బాపు సూక్తులే నేటి పాలకుల మార్గాలు.. అవే నిజమైన పాలనకు మార్గదర్శకాలు

Vardhman Boss Duped: రూ.7కోట్లు దోపిడికి గురైన ప్రముఖ బిజినెస్‌మెన్.. మీరు మోసపోకుండా జాగ్రత్తపడండి!

Big Stories

×