Latest Technology : మామూలుగా ఆర్కియాలజిస్ట్స్కు దొరికే వస్తువులు.. ముఖ్యంగా రాళ్లు అనేవి ఈనాటివి కావు. ఎన్నో వందల, వేల ఏళ్ల క్రితానికి చెంది ఉంటాయి. అయితే ఒకప్పుడు ఈ రాళ్ల వయసును కనుక్కోవడం కోసం శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత దీనికోసం పలు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందులోని ఫేమస్ అయిన ఇసోటోపిక్ డేటింగ్ ప్రక్రియ గురించి శాస్త్రవేత్తలు తాజాగా బయటపెట్టారు.
వందలు మాత్రమే కాదు.. వేల్ల ఏళ్ల క్రితం రాయి గురించి అయినా ఇసోటోపిక్ డేటింగ్ ప్రక్రియ ద్వారా కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్కియాలజిస్ట్స్ ఎక్కువగా కార్బన్ ఇసోటోప్ను రాళ్ల వయసును గుర్తించడం కోసం ఉపయోగిస్తున్నారు. కార్బన్ ఇసోటోప్ డేటింగ్ 14సి అనే ప్రక్రియ 50 వేల ఏళ్ల క్రితం రాళ్లను కూడా గుర్తించగలదు. ఇక కాస్మోజెనిక్ ఇసోటోప్ అనే 41 సీఏ అనే ప్రక్రియ అయితే ఏకంగా 99 వేల ఏళ్ల క్రితం రాళ్లను కూడా గుర్తించగలదు.
కాస్మోజెనిక్ ఇసోటోప్ 41 సీఏ అనే ప్రక్రియ.. కార్బన్ ఇసోటోప్ 14 సీ కంటే 17 రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది. ఇప్పటివరకు రాళ్ల వయసును గుర్తించడం కోసం కాస్మోజెనిక్ ఇసోటోప్ ప్రక్రియ మెరుగైనదని ఆర్కియాలజిస్ట్స్ భావించేవారు. కానీ దానికంటే మెరుగైన మరో ప్రక్రియను ఇటీవల శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కోణంలో ఆటమ్ ట్రాప్ ట్రేస్ అనాలసిస్ (ఆట్టా) ద్వారా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సక్సెస్ కూడా అయ్యాయని వారు ప్రకటించారు.
ఎప్పుడో భూమిలో పాతుకుపోయిన రాళ్లను, మనుషుల అస్థికలను గుర్తించడానికి, వాటి వయసు ఎంత ఉంటుందో కచ్చితంగా చెప్పడానికి ఆట్టా మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీని గురించి మరిన్ని పరిశోధనలు చేసి.. దీనిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం కోసం ప్రపంచ దేశాల జియోలజిస్ట్స్, ఆర్కియాలజిస్ట్స్తో శాస్త్రవేత్తలు కలిసి పనిచేయనున్నారు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉపయోగపడే కొత్త ప్రయోగం అని శాస్త్రవేత్తలు గర్వంగా చెప్తున్నారు.