EPAPER

TSPSC : పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ..

TSPSC :  పేపర్ లీకేజీ కేసు.. రంగంలోకి ఈడీ..

TSPSC Paper Leak Case : పేపర్‌ లీకేజీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది. వారి వాంగ్మూలాల నమోదుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేసింది.


ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ భావిస్తోంది. మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానిస్తోంది. సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శంకరలక్ష్మిపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. టీఎస్‌పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని కోరింది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఈడీ ప్రశ్నించనుంది.

మరోవైపు TSPSC కేసులో సిట్‌ హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఈ కేసును సిట్ అధికారులు నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 150 మందిని విచారించారు. 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని కీలక సమాచారం సేకరించారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డి వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితుల పెన్‌డ్రైవ్, మొబైళ్లలో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్‌ ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ నివేదిక ఈ కేసులో కీలక కానుంది. ఆ వివరాలను సిట్ హైకోర్టుకు సమర్పిస్తుంది.


Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×