Samantha Shakuntalam Movie Updates (Entertainment News) :– ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందించారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు.
3D టెక్నాలజీతో విజువల్ వండర్గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. . ఈ మూవీ ప్రమోషన్స్ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు దిల్రాజు, గుణ శేఖర్ అండ్ టీమ్. అందులో భాగంగా సోమవారం ఈ సినిమా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత, దర్శకుడు సమంత, నిర్మాత దిల్ రాజు పాల్గొని పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు..
శకుంతల పాత్రకు ఎంత వరకు రిలేట్ అయ్యారు?
శాకుంతలం కథ గురించి చిన్నప్పుడు నాకు కొంచెం తెలుసు. పూర్తి వివరాలు తెలియవు. ఇది 5 శతాబ్దంలో రాసిన కథ. అయితే ఇప్పటి మోడ్రన్ అమ్మాయి అయిన నేను ఆ క్యారెక్టర్తో రిలేట్ అవుతున్నాను. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. నేను ప్రతి సినిమాకు నటిగా నా బెస్ట్ ఇస్తున్నాను. ఈ శకుంతల రోల్ చేయటం అనేది నటిగా నాకు ఓ పెద్ద బాధ్యత. దాంతో ముందు నేను భయపడ్డాను. అందుకనే గుణ శేఖర్గారు అడగ్గానే నో చెప్పాను. నేను అప్పుడే రాజీ పాత్ర చేసి వచ్చాను. ఇప్పుడు చేసే శకుంతల పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతీ ఫ్రేమ్లో అందంతో పాత్రలో ఓ డిగ్నిటీ, గ్రేస్ కనపడాలి. నేను ఆ పాత్రకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. అందుకు కారణం నా దర్శకుడు, నిర్మాత నా నటనపై సంతృప్తిగా ఉన్నారు.
నేటి పరిస్థితులకు శాకుంతలం ఎంత వరకు కనెక్ట్ అవుతుంది?
శకుంతల, దుష్యంతుడితో ప్రేమలో పడుతుంది. అప్పటి సమాజానికి విరుద్ధంగా ఆమె వెళుతుంది. సమాజంలో ఆమె పాత్ర కోసం ఆమె పోరాడుతుంది. ఓటమిని అస్సలు ఒప్పుకోదు. నాకు తెలిసి ఆమె ఫస్ట్ సింగిల్ మదర్. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్టింగ్ అనే చెప్పాలి.
ఒకప్పుడు అమాయకంగా ఉన్న సమంతకు.. ఇప్పుడు ధైర్యంగా సమస్యలపై పోరాడేంత శక్తి సమంతకు ఎక్కడి నుంచి వచ్చింది?
హీరోయిన్గా గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవు. దాంతో హ్యాపీగా ఉన్నాను. అయితే ఈ ప్రయాణంలో నేను ఫేస్ చేసిన సమస్యల వల్ల ఇప్పడిలా మారిపోయాను. సాధారణంగా సమస్యలు వచ్చినప్పుడు కచ్చితంగా అందరూ మారుతారు. నేనేమీ స్పెషల్ ఏమీ కాదు.
శకుంతల పాత్ర కోసం ఎలాంటి రెఫరెన్స్లు తీసుకున్నారు?
గుణ శేఖర్గారు నాకు శాకుంతలం కథ నెరేట్ చేసిన తర్వాత ఎలాంటి మైథిలాజికల్ మూవీస్ చూడొద్దని చెప్పారు. అందుకు కారణం.. ఆయన మైండ్లో శకుంతల పాత్ర గురించి క్లియర్ కట్ ఐడియా ఉంది. దాంతో నేను గుణ శేఖర్గారి విజన్ను ఫాలో అయిపోతూ వచ్చాను. దాంతో ఇద్దరి ఆలోచనలు ఒకటిగా సాగాయి. దీంతో ఒకట్రెండు టేక్స్లోనే సన్నివేశాలను చేస్తూ వచ్చేశాను.
త్రీడీలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది?
నేను కొచ్చిలో శాకుంతలం త్రీడీ ట్రైలర్ చూసి షాకయ్యాను. అలా నోరెళ్ల బెట్టేశాను. చాలా ఎగ్జయిట్ అయ్యాను. అవతార్లాంటి సినిమాలను త్రీడీలో చూసినప్పుడు మనం ఆ ప్రపంచంలో పిల్లల్లాగా మారిపోతాం. అలాంటి మ్యాజికల్ ప్రపంచానికి గుణ శేఖర్గారు శాకుంతలం కోసం క్రియేట్ చేశారు.
అల్లు అర్జున్, సమంతలది హిట్ పెయిర్. మరి అల్లు అర్హతో ఎలా ఉంటుంది.
సమంత మాట్లాడుతూ .. అల్లు అర్హ స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఆడియెన్స్ పెదవులపై ఓ చిరునవ్వు వచ్చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు.
దుష్యంతుడు, శకుంతల కలిసిన తర్వాత సినిమా ఇంకా ఎంత ఉంటుంది?
ఈ సినిమాలో ఒరిజినల్ నగలను ఉపయోగించారు కదా.. వాటిని ఏ మేరకు ఉపయోగించారు?
ఈ ప్రశ్నకు గుణ శేఖర్ మాట్లాడుతూ ..ఈ సినిమాలో సమంత రాణిగా కనిపించేది తక్కువ సేపే. అయినా మేం ఆభరణాలను ఎలా ఉపయోగించామనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మూడు లాంగ్వేజెస్లో డబ్బింగ్ చెప్పటం ఎలా అనిపించింది?
సమంత మాట్లాడుతూ ..పాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్న తర్వాత ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శాకుంతలం నిర్మాణంలో భాగం కావటానికి కారణమేంటి?
దిల్ రాజు మాట్లాడుతూ .. నేను నిర్మాతగా 50 సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్గా 70 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇన్ని సినిమాలు చేసిన నేను ఇలాంటి డిఫరెంట్ సినిమా కూడా చేయాలనే ఉద్దేశంతో ఇందులో పార్ట్ అయ్యాను. గుణ శేఖర్గారు మంచి సినిమాను ఆడియెన్స్కి అందించాలనుకున్నారు. అందులో నేను భాగమయ్యాను. ఈ క్రమంలో నేను ఫైనాన్సియల్గా ఏమవుతుందని ఆలోచించలేదు.
ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాకు ముందుగానే ప్రీమియర్స్ వేయటానికి గల కారణాలేంటి?
దిల్ రాజు మాట్లాడుతూ ..నేను మెల్లగా హాలీవుడ్ ప్యాట్రన్కి వెళదామనుకుంటున్నాను. హాలీవుడ్లో నిర్మాణ సంస్థలు సినిమాను నిర్మించిన తర్వాత వాళ్లు ఫైనాన్సియల్గా ఆలోచించరు. ప్రీమియర్ షోస్ వేస్తారు. హాలీవుడ్ సినిమాలను కూడా ముందుగానే ఇక్కడ ప్రీమియర్స్ వేస్తారు కదా ఆ ప్యాట్రన్లోనే నేను వెళదామనుకుంటున్నా. ఫైనాన్సియల్గా ఎలా ఉన్నా నేను రెడీ. అందుకనే శాకుంతలం సినిమాను కూడా ప్రీమియర్స్ వేయటానికి రెడీ అయ్యాను. ప్రీమియర్స్కు ముందుగా నేను కామన్ ఆడియెన్స్నే పిలిచాను.వాళ్లు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ వేసుకోరు. మనసులో ఏం అనిపించిందో అదే చెప్పేస్తారు.
త్రీడీ సినిమా కదా, టికెట్ రేట్స్ ఏమైనా పెంచుతున్నారా?
దిల్ రాజు మాట్లాడుతూ .. నార్మల్ త్రీడీ సినిమాకు ఎలాంటి టికెట్ రేట్స్ ఉన్నాయో అలాగే ఉంటాయి. టికెట్ రేట్స్ పెంచాలని మేం ఎవరినీ అడగలేదు.
సమంత మాట్లాడుతూ … కచ్చితంగా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది. నేను కమిట్ అయిన సినిమాలు సకాలంలో సెట్స్ పైకి వెళ్లకపోతే ముందుగా ఇబ్బంది పడేది నిర్మాతలే. అయినా వాళ్లెవ్వరూ నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు సినిమా షూటింగ్కు ఎప్పుడు వస్తారు? అని అడిగి ఇబ్బంది పెట్టలేదు. ఆరోగ్యవంతురాలిగా మారిన తర్వాతే రమ్మన్నారు. అక్కడ వాళ్లు తమ బంగారు హృదయాలను చూపించుకున్నారు.