PM Modi: ప్రధాని మోదీ తెలంగాణలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ వేదికగా.. రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులను ఆరంభించారు. బీబీనగర్ ఎయిమ్స్లో ఆధునిక భవనాల నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మోదీ. అలాగే ఐదు జాతీయ రహదారులనూ వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
సికింద్రాబాద్ మహబూబ్నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులను ఆవిష్కరించారు. సికింద్రాబాద్ జోన్లో 13 MMTS సర్వీసులనూ ప్రారంభించారు ప్రధాని మోదీ.