Renu Desai: బద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయింది నటి రేణూ దేశాయ్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత సడెన్గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 18 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో రేణూ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజగా రేణూ విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ నోట్ పెట్టింది. ‘‘అనుకోకుండా కొంత మంది మన జీవితంలోకి వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల చూపులు నేరుగా మన హృదయాలతో మాట్లాడుతాయి.
వాళ్లతో మనం కొన్ని గంటలు మాత్రమే గడిపినప్పటికీ.. వాళ్ల ప్రభావం మన జీవితాలపై జీవితాంతం ఉంటుంది. అలాంటి పరిచయాలు కొన్ని మనల్ని బాధ పెడుతాయి కూడా’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రేణూ రాసిన నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.