JOBS: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో మొత్తం 138 ట్రైయినీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ పాస్ అయి ఉండాలి.
మొత్తం పోస్టులు: 138
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: ఏప్రిల్ 18
ఎంపిక : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్ : www.powergrid.in