Sharmila: కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిలకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిని కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని.. దాని ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేద్దామని అన్నారు.
ప్రగతి భవన్ మార్చ్ పిలుపునిద్దామని రేవంత్ రెడ్డి, సంజయ్లను కోరారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని.. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని వెల్లడించారు.
ఇక షర్మిల ఫోన్కు బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సమావేశమవుదామని షర్మిలతో చెప్పారు. ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పార్టీలో చర్చించినాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.